Yogavasista

షణ్ముఖ ముద్ర



షణ్ముఖ ముద్ర:



తూర్పు లేదా ఉత్తర దిక్కును చూస్తూ మేరుదండమును మరియు మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా సుఖాసనములో, జ్ఞానముద్ర లేదా లింగముద్ర లోగాని కూర్చుండ వలయును. కొంచెము రిలాక్స్ (Relax)అవ్వాలి.   కూటస్థములో దృష్టి నిలిపి ఖేచరీముద్రలో ఉండ వలయును..

శ్వాస లోపలి తీసికోవలయును. మేరుదండములోని ఇడా పింగళ సూక్ష్మనాడులమధ్యనున్న సుషుమ్నా సూక్ష్మనాడి ద్వారా  మూలాధార, స్వాధిష్ఠాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా నెగటివ్, మరియు ఆజ్ఞా పాజిటివ్ చక్రము వరకు ఆరోహణా క్రమములో  వెళ్తున్నట్లుగా భావించాలి. మనస్సు మరియు దృష్టి ఆ శ్వాసను అనుసరించాలి. 



ఇప్పుడు  చెవురంధ్రములను బొటనవ్రేళ్ళ(అంగుష్ఠము)తో, నేత్రములను చూపుడు వ్రేళ్ళ(తర్జని)తో, నాసికా రంధ్రములను మధ్య వ్రేళ్ళ(మధ్యమ)తో, పయి పెదవులు ఉంగరపు వ్రేళ్ళ(అనామిక)తో, క్రింది పెదవులు చిటికిన  వ్రేళ్ళ(కనిష్ఠ)తో వెంటనే మూయ వలయును. మనస్సు మరియు దృష్టి కూటస్థములో కేంద్రీకరించవలయును. అంతః కుంభకము వీలయినంత సమయము చేయవలయును. కూటస్థములోని  అద్భుత ప్రకాశమును గమనించవలయును. దీనినే మూడవనేత్రము అందురు. బయట పసుపు రంగు(ఓంకారము) లోపల నీలము రంగు(శ్రీ కృష్ణచైతన్యము) దానిలోపల అయిదు భుజముల ప్రకాశము(పరమాత్మ చైతన్యము) కనిపించును. ఆ పరమాత్మ చైతన్యములోనికి చొచ్చుకు పోవలయును.




ఇప్పుడు శ్వాసను వదులుతూ ఆ శ్వాస మేరుదండములోని ఇడా పింగళ సూక్ష్మనాడులమధ్యనున్న సుషుమ్నా సూక్ష్మనాడి ద్వారా  ఆజ్ఞా పాజిటివ్ , ఆజ్ఞా నెగటివ్, విశుద్ధ, అనాహత, మణిపుర, స్వాధిష్ఠాన మరియు మూలాధార,  చక్రముల  ద్వారా బయటికి అవరోహణా క్రమములో  వెళ్తున్నట్లుగా భావించాలి.

ఇలా మూడు మారులు మూడు ముద్రలు వేయవలయును. ఆ తరువాత ధ్యానములో నిమగ్నమవ్వ వలయును.

మహాముద్ర



మహాముద్ర:

తూర్పు లేదా ఉత్తర దిక్కును చూస్తూ మేరుదండమును మరియు మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా సుఖాసనములో, జ్ఞానముద్ర లేదా లింగముద్ర లోగాని కూర్చుండ వలయును. కొంచెము రిలాక్స్ (Relax)అవ్వాలి.   కూటస్థములో దృష్టి నిలిపి ఖేచరీ ముద్రలో ఉండ వలయును.. నోరు పూర్తిగా తెరిచి శ్వాస పూర్తిగా బయటికి వదలవలయును. నాలుక వెనక్కి ముడిచి అంగిటిలో కొండనాలుక క్రింద ఉంచవలయును. దీనిని ఖేచరీ ముద్ర అంటారు. నోరు బాగా తెరిచిఉంచుకొనవలయును.


ఖేచరీ ముద్రలోఉండి కాళ్ళు బారజాచుకోవాలి. ఎడమ కాలి నడమ గుదస్థానము క్రింద ఉంచవలయును. కుడికాలును పూర్తిగా వెనక్కిలాగి ముడుచుకొని కూర్చొనవలయును. ఇలా గొంతుకూర్చోని ఖేచరీ ముద్రలో ఉండాలి. ఖేచరీ ముద్రలోఉండి నోరు బాగా తెరిచిఉంచుకొని శ్వాస పూర్తిగా లోపలికి తీసుకోవాలి. ఎడమ కాలి నడమ గుదస్థానము క్రిందనే ఉంచి శ్వాస పూర్తిగా బయటికి వదలుతూ కుడికాలును పూర్తిగా బారజాచుకోవాలి. రెండు చేతివ్రేళ్ళతో కాలివ్రేళ్ళను గట్టిగా చుట్టి పట్టుకోవాలి. చుట్టి పట్టుకొనేటప్పుడు కుడికాలును వంచకూడదు. 


అదేసమయములో తలనువంచి ఆ వంచినతలతో మోకాలుచిప్పను తాకాలి.  ఖేచరీ ముద్రలోనే ఉండి నోరు బాగా తెరిచిఉంచుకొనే శ్వాస పూర్తిగా లోపలికి తీసుకుంటూ కుడికాలును పూర్తిగా వెనక్కి తీసుకుంటూ కుడికాలి నడమ గుదస్థానము క్రింద ఉంచవలయును. ఇప్పుడు ఖేచరీ ముద్రలోనే ఉండి నోరు బాగా తెరిచిఉంచుకొనే శ్వాస పూర్తిగా బయటికి వదలుతూ ఎడమ కాలును పూర్తిగా బారజాచుకోవాలి.  రెండు చేతివ్రేళ్ళతో కాలివ్రేళ్ళను గట్టిగా చుట్టి పట్టుకోవాలి. చుట్టి పట్టుకొనేటప్పుడు ఎడమ కాలును వంచకూడదు. అదేసమయములో తలను వంచి ఆ వంచినతలతో మోకాలుచిప్పను తాకాలి. 

ఇప్పుడు ఖేచరీ ముద్రలోనే ఉండి నోరు బాగా తెరిచిఉంచుకొనే శ్వాస పూర్తిగాలోపలికి తీసుకుంటూ ఎడమ కాలును పూర్తిగా వెనక్కి తీసు కోవాలి. ఇప్పుడు రెండుకాళ్ళు ఒకచోట చేరినవి. అలాగే గొంతు కూర్చోని రెండు చేతివ్రేళ్ళతో ఆ రెండు మోకాళ్ళను  గట్టిగా చుట్టి పట్టుకోవాలి.  ఖేచరీ ముద్రలోనే ఉండి నోరు బాగా తెరిచిఉంచుకొనే శ్వాస పూర్తిగా బయటికి వదలుతూ రెండు కాళ్ళు బారజాచుకుంటూ తలను వంచి ఆ వంచినతలతో బారజాచిన ఆ రెండు రెండు కాళ్ళ మోకాలుచిప్పలను తాకుతూ ఆ రెండు కాళ్ళ వ్రేళ్ళను రెండు చేతివ్రేళ్ళతో గట్టిగా చుట్టి పట్టుకోవాలి. ఖేచరీ ముద్రలోనే ఉండి నోరు బాగా తెరిచిఉంచుకొనే శ్వాస పూర్తిగా లోపలికి తీసుకుంటూ రెండు కాళ్ళను వెనక్కి తీసుకొని గొంతు కూర్చొనవలయును.  ఇప్పుడు ఒక మహాముద్ర అయినది.  

ఇప్పుడు ఎడమ కాలి నడమ గుదస్థానము క్రింద ఉంచవలయును. తిరిగి పయిన చెప్పిన విధముగా చేయవలయును. ఇలా మూడు మారులు మూడు ముద్రలు వేయవలయును.





క్రియ 1:

తూర్పు లేదా ఉత్తర దిక్కును చూస్తూ మేరుదండమును మరియు మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా సుఖాసనములో, జ్ఞానముద్ర లేదా లింగముద్ర లోగాని కూర్చుండ వలయును. కొంచెము రిలాక్స్ (Relax)అవ్వాలి.   కూటస్థములో దృష్టి నిలిపి ఖేచరీముద్రలో ఉండ వలయును..

ఖేచరీముద్రలోఉండి నోరు పూర్తిగా తెరిచి శ్వాస పూర్తిగా లోపలికి తీసికోవాలి. శ్వాస మేరుదండములోని ఇడా పింగళ సూక్ష్మనాడులమధ్యనున్న సుషుమ్నా సూక్ష్మనాడి ద్వారా  మూలాధార, స్వాధిష్ఠాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా నెగటివ్, మరియు ఆజ్ఞా పాజిటివ్ చక్రము వరకు ఆరోహణా క్రమములో  వెళ్తున్నట్లుగా భావించాలి. మనస్సు మరియు దృష్టి ఆ శ్వాసను అనుసరించాలి. ఖేచరీముద్రలో నోరు పూర్తిగా తెరిచి లోపలికి తీసికునే శ్వాస శివ బీజమంత్రము. దీనినే సోమ అంటారు.





అదేవిధముగా శ్వాస పూర్తిగా వదలుతూ ఆ శ్వాస మేరుదండములోని ఇడా పింగళ సూక్ష్మనాడులమధ్యనున్న సుషుమ్నా సూక్ష్మనాడి ద్వారా  ఆజ్ఞా పాజిటివ్ , ఆజ్ఞా నెగటివ్, విశుద్ధ, అనాహత, మణిపుర, స్వాధిష్ఠాన మరియు మూలాధార,  చక్రముల  ద్వారా బయటికి అవరోహణా క్రమములో  వెళ్తున్నట్లుగా భావించాలి. మనస్సు మరియు దృష్టి ఆ శ్వాసను అనుసరించాలి. ఖేచరీముద్రలో నోరు పూర్తిగా తెరిచి బయటికి వదిలే శ్వాస శక్తి బీజమంత్రము. దీనినే అగ్ని అంటారు.

ఈ విధముగా ఒక శ్వాసను మేరుదండము ద్వారా మూలాధార, స్వాధిష్ఠాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా నెగటివ్, మరియు ఆజ్ఞా పాజిటివ్ చక్రము వరకు ఆరోహణా క్రమములో తీసికొనుట తిరిగి ఆ శ్వాసను ఆజ్ఞా పాజిటివ్ , ఆజ్ఞా నెగటివ్, విశుద్ధ, అనాహత, మణిపుర, స్వాధిష్ఠాన మరియు మూలాధార,  చక్రముల  ద్వారా బయటికి అవరోహణా క్రమములో బయటికి పంపుట ఒక క్రియ అవుతుంది. ఈ విధముగా క్రియలు చేస్తున్నప్పుడు పవిత్ర ఓంకార నాదము సాధకునకు వినబడుతుంది. విధి అనగా ధర్మమూ. వేద అనగా వినుట. ఓంకార నాదము  వినుట యే వేదవిధి. .  





ఖేచరీ ముద్ర



ఓంకార క్రియ:


తూర్పు లేదా ఉత్తర దిక్కును చూస్తూ మేరుదండమును మరియు మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా సుఖాసనములో, జ్ఞానముద్ర లేదా లింగముద్ర లోగాని కూర్చుండ వలయును. కొంచెము రిలాక్స్ (Relax) అవ్వాలి.   కూటస్థములో దృష్టి నిలిపి ఖేచరీ ముద్రలో ఉండ వలయును.. నోరు పూర్తిగా తెరిచి శ్వాస పూర్తిగా బయటికి వదలవలయును. నాలుక వెనక్కి ముడిచి అంగిటిలో కొండనాలుక క్రింద ఉంచవలయును. 


దీనిని ఖేచరీ ముద్ర అంటారు. నోరు బాగా తెరిచి ఉంచుకొనవలయును. 



  • మూలాధారచక్రము మీద ఏకాగ్రత చేయాలి. మనస్సు దృష్టి మూలాధారచక్రము మీద ఉంచాలి. రెండు చెవుల రంధ్రములు రెండు బొటనవ్రేళ్ళతో  మూసుకొనవలయును. నేత్రములు మూసుకొనవలయును. కనుకొనలను చిటికినవ్రేళ్ళతో మృదువుగా నొక్కివుంచవలయును. మిగిలిన వ్రేళ్ళను నుదురుమీద ఉంచవలయును. రెండు నేత్రములను చిటికినవ్రేళ్ళతో మృదువుగా నాలుగు పర్యాయములు క్లాక్ వైజ్ (clockwise) గా ‘ఓం’ అని మనస్సులో అనుకుంటూ గుండ్రముగా త్రిప్పాలి.  




  • ఇప్పుడు స్వాధిష్ఠానచక్రము మీద ఏకాగ్రత చేయాలి. మనస్సు దృష్టి స్వాధిష్ఠానచక్రము మీద ఉంచాలి. రెండు నేత్రములను చిటికినవ్రేళ్ళతో మృదువుగా ఆరు పర్యాయములు క్లాక్ వైజ్ (clockwise) గా ‘ఓం’ అని మనస్సులో అనుకుంటూ గుండ్రముగా త్రిప్పాలి.


  • ఇప్పుడు మణిపురచక్రము మీద ఏకాగ్రత చేయాలి. మనస్సు దృష్టి మణిపురచక్రము మీద ఉంచాలి. రెండు నేత్రములను చిటికినవ్రేళ్ళతో మృదువుగా పది పర్యాయములు క్లాక్ వైజ్ (clockwise) గా ‘ఓం’ అని మనస్సులో అనుకుంటూ గుండ్రముగా త్రిప్పాలి.





  • ఇప్పుడు అనాహతచక్రము మీద ఏకాగ్రత చేయాలి. మనస్సు దృష్టి అనాహతచక్రము మీద ఉంచాలి. రెండు నేత్రములను చిటికినవ్రేళ్ళతో మృదువుగా పన్నెండు పర్యాయములు క్లాక్ వైజ్ (clockwise) గా ‘ఓం’ అని మనస్సులో అనుకుంటూ గుండ్రముగా త్రిప్పాలి.



  • ఇప్పుడు విశుద్ధచక్రము మీద ఏకాగ్రత చేయాలి. మనస్సు దృష్టి విశుద్ధచక్రము మీద ఉంచాలి. రెండు నేత్రములను చిటికినవ్రేళ్ళతో మృదువుగా పదహారు పర్యాయములు క్లాక్ వైజ్ (clockwise) గా ‘ఓం’ అని మనస్సులో అనుకుంటూ గుండ్రముగా త్రిప్పాలి.





  • ఇప్పుడు ఆజ్ఞా నెగటివ్ చక్రము మీద ఏకాగ్రత చేయాలి. మనస్సు దృష్టి ఆజ్ఞాచక్రము మీద ఉంచాలి. రెండు నేత్రములను చిటికినవ్రేళ్ళతో మృదువుగా పదునెనిమిది పర్యాయములు క్లాక్ వైజ్ (clockwise) గా ‘ఓం’ అని మనస్సులో అనుకుంటూ గుండ్రముగా త్రిప్పాలి.



  • ఇప్పుడు ఆజ్ఞా పాజిటివ్ చక్రము మీద ఏకాగ్రత చేయాలి. మనస్సు దృష్టి ఆజ్ఞాచక్రము మీద ఉంచాలి. రెండు నేత్రములను చిటికినవ్రేళ్ళతో మృదువుగా ఇరువది పర్యాయములు క్లాక్ వైజ్ (clockwise) గా ‘ఓం’ అని మనస్సులో అనుకుంటూ గుండ్రముగా త్రిప్పాలి.


               



  • ఇప్పుడు ఆజ్ఞా పాజిటివ్ చక్రము వరకు అర్థవృత్తము అయినది. ఇప్పుడు మిగిలిన అర్థవృత్తము ఆజ్ఞా పాజిటివ్ చక్రమునుండి మొదలు అయినది.



  • ఇప్పుడు ఆజ్ఞా పాజిటివ్ చక్రము మీద ఏకాగ్రత చేయాలి. మనస్సు దృష్టి ఆజ్ఞాచక్రము మీద ఉంచాలి. రెండు నేత్రములను చిటికినవ్రేళ్ళతో మృదువుగా ఇరువది పర్యాయములు క్లాక్ వైజ్ (clockwise) గా ‘ఓం’ అని మనస్సులో అనుకుంటూ గుండ్రముగా త్రిప్పాలి.





  • ఇప్పుడు ఆజ్ఞా నెగటివ్ చక్రము మీద ఏకాగ్రత చేయాలి. మనస్సు దృష్టి ఆజ్ఞాచక్రము మీద ఉంచాలి. రెండు నేత్రములను చిటికినవ్రేళ్ళతో మృదువుగా పదునెనిమిది పర్యాయములు క్లాక్ వైజ్ (clockwise) గా ‘ఓం’ అని మనస్సులో అనుకుంటూ గుండ్రముగా త్రిప్పాలి.



  • ఇప్పుడు విశుద్ధచక్రము మీద ఏకాగ్రత చేయాలి. మనస్సు దృష్టి విశుద్ధచక్రము మీద ఉంచాలి. రెండు నేత్రములను చిటికినవ్రేళ్ళతో మృదువుగా పదహారు పర్యాయములు క్లాక్ వైజ్ (clockwise) గా ‘ఓం’ అని మనస్సులో అనుకుంటూ గుండ్రముగా త్రిప్పాలి.





  • ఇప్పుడు అనాహతచక్రము మీద ఏకాగ్రత చేయాలి. మనస్సు దృష్టి అనాహతచక్రము మీద ఉంచాలి. రెండు నేత్రములను చిటికినవ్రేళ్ళతో మృదువుగా పన్నెండు పర్యాయములు క్లాక్ వైజ్ (clockwise) గా ‘ఓం’ అని మనస్సులో అనుకుంటూ గుండ్రముగా త్రిప్పాలి.



  • ఇప్పుడు మణిపురచక్రము మీద ఏకాగ్రత చేయాలి. మనస్సు దృష్టి మణిపురచక్రము మీద ఉంచాలి. రెండు నేత్రములను చిటికినవ్రేళ్ళతో మృదువుగా పది పర్యాయములు క్లాక్ వైజ్ (clockwise) గా ‘ఓం’ అని మనస్సులో అనుకుంటూ గుండ్రముగా త్రిప్పాలి.





  • ఇప్పుడు స్వాధిష్ఠానచక్రము మీద ఏకాగ్రత చేయాలి. మనస్సు దృష్టి స్వాధిష్ఠానచక్రము మీద ఉంచాలి. రెండు నేత్రములను చిటికినవ్రేళ్ళతో మృదువుగా ఆరు పర్యాయములు క్లాక్ వైజ్ (clockwise) గా ‘ఓం’ అని మనస్సులో అనుకుంటూ గుండ్రముగా త్రిప్పాలి.



  • ఇప్పుడు మూలాధారచక్రము మీద ఏకాగ్రత చేయాలి. మనస్సు దృష్టి మూలాధారచక్రము మీద ఉంచాలి. రెండు నేత్రములను చిటికినవ్రేళ్ళతో మృదువుగా నాలుగు పర్యాయములు క్లాక్ వైజ్  (clockwise) గా ‘ఓం’ అని మనస్సులో అనుకుంటూ గుండ్రముగా త్రిప్పాలి.







  • ఇప్పుడు మొత్తము వృత్తము పూర్తిఅయినది. తిరిగి మూలాధారచక్రమునుండి ప్రారంభము చేయవలయును. ఇలా అయిదువృత్తములు మూలాధారచక్రముతో పూర్తి చేయవలయును. 



  • ఇప్పుడు ఆరవచక్రము అర్థవృత్తము ఆజ్ఞా పాజిటివ్ చక్రముతో పూర్తి చేయవలయును.  ఇప్పడు ఆ ఆజ్ఞా పాజిటివ్ చక్రము అనగా కూటస్థము మీద మనస్సు దృష్టి ఉంచి తీవ్ర ధ్యానము  చేయవలయును.  



ఆరోగ్యాని కి ముద్రలు












ఎనిమిది సిద్దులను అష్ట సిద్దులు






భగవానుని దివ్య ఆరాధనకు ఫలముగా భక్తులకు ప్రాప్తించే ఎనిమిది సిద్దులను అష్ట సిద్దులు అంటారు.

అవి

అణిమ, మహిమ, గరిమ, లషిమ, ప్రాప్తి, ప్రాకమ్యం, ఈశిత్వం , వశిత్వంఅనే ఎనిమిదీ అష్టసిద్ధులు.

1. అణిమ : చిన్నరూపము దాల్చుట
అణురూప ప్రాణులందు పరమాణురూపముగానుండుట(సూక్ష్మరూపము) సుక్ష్మావస్థ లో కూడా భగవంతుడు ఉన్నాడు అని నమ్మి అతనిలో మనస్సును నిలుపుటవల్ల సిద్ధి వస్తుంది. దీని వల్ల అత్యంత సుక్ష్మఅణువుగా యోగి తనను తానూ మార్చుకొనగలడు.

2. మహిమ : పెద్ద రూపము దాల్చుట
( రెండు సిద్దులను, శ్రీ మద్రామాయణ సుందర కాండలో హనుమంతునిలో చుడగలము)
విరాడ్రూపముగానుండుట(పెద్దరూపమునుపొందుట) భగవంతుని మహాత్తుని దర్శించగలిగిన సాధకునకు సిద్ధి వస్తుంది. దీని కారణంగా అతను శివ, కేశవులకు సామానమయిన కీర్తిని పొందగలుగుతాడు

3. గరిమ : చాల బరువగుట
(తృణా వర్తుని జంపు శ్రీ కృష్ణునిలో చూతుము)
బ్రహ్మాండాదులకంటే బరువుగానుండుట ; సిద్ధి సాధించిన వారు తమ శరీర బరువును భూభారమునకు సమానముగా చేయగలరు.

4. లఘిమ : తేలికయగుట
(నీటి పైన నడచుట, ఆకాశ మార్గమున పోవుట)
సిద్ధి గలవారు తమ శరీరమును దూది కంటే తేలికగా ఉంచగలరు

5. ప్రాప్తి : అనుకొన్న స్థాయికి చేరుట. సిద్ధి ద్వారా  కావాలనుకున్నా క్షణములలో శూన్యం నుండికూడా సృజించుకోగలరు

6. ప్రాకామ్యము : కోరినది పొందుట. అనేక దివ్య శక్తులు (దూర దర్శనము, దూర శ్రవణము , ఆకాశ గమనము) వారి వశములో ఉంటాయి.

7. ఈశత్వం : పంచ భూతాల పై అధికారము సంపాదించుట (ప్రహ్లాదునివలె). ఇంద్రాది దిక్పాలకులను కూడా నియంత్రించగలిగిన అధికారం వస్తుంది

8. వశిత్వం : సకల జీవరాశులు వారు చెప్పినట్లుగా ప్రవర్తింప చేయగలిగిన శక్తి. ఇంద్రియములను లోబరచుకొని యిష్టార్ధ సిద్ది నొందుట.

యెనిమిదింటిని అష్ట సిద్ధులు అందురు. ఎవ్వరీ అష్ట సిద్దులను యోగ మార్గమున పొందగలుగుదురో వారు బ్రహ్మ స్వరూపమును పొందగలరు.

ఐతే సిద్ధులు ప్రాప్తించిన వారు సిద్ధులను ప్రదర్శించుట నిషేదించ బడినది.


=========================================


యోగసాస్త్రంలో ఎనిమిది సంఖ్యనుమాయకు సంకేతంగా చెబుతారు. తొమ్మిది సంఖ్యను పరమాత్మకు ప్రతీకక్గా చెబుతారు. భగవద్గీతలో  అష్టవిధమాయల ప్రస్తావన కనిపిస్తుంది. పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం కలిస్తే ఎనిమిది అవుతాయి.  పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం కలిస్తే ఎనిమిది అవుతాయి. పంచభూతాలను పంచేంద్రియాలు గా పరిగణిస్తే.. [కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం]+ మనసు + బుద్ధి + అహంకారం ఎనిమిదిని జయించిన వారికి కలిగే వాటినే అష్ట సిద్ధులు అంటారు.. పంచభూతాలకు పంచేంద్రియాలు ప్రతీక  గనుక మన శరీరమే ఒక  మాయామహలుగా గ్రహించాలి.
  
అష్టమాయల వల్లనే అష్టకష్టాలు సంప్రాప్తిస్తాయి.  అష్టమాయల్ని  జయించాలంటే – ” ఓం నమోనారాయణాయఅనే అష్టాక్షరీ మంత్రాన్ని ఆశ్రయించాలని పెద్దల మాట.  అలా ఆశ్రయించిన ప్రహ్లాదుడు, ద్రువుడు, గజేంద్రుడు, అంబరీషుడు, ద్రౌపతి, అర్జునుడుఇలా ఎందరో భక్తులు సదా గట్టేక్కారు.

దత్తచరితంలో శ్రీ దత్తాత్రేయ మహాగురువులు అష్టసిద్ధుల్ని తమ బిడ్డలుగా ప్రస్తావించారు..

విభూతిర్భూతి  హేతుత్వాద్భసితం తత్త్వ భాస్యత్  అష్ట ఐశ్వర్యాలుగా చెప్పే అష్టసిద్ధుల్ని విభూతులని కూడా అంటారు. ఇంతకీ ఏమిటీ అష్టసిద్ధులు?

మోక్షమార్గాన ప్రయాణించే సాధకుణ్ని ప్రలోభ పెట్టి, పక్కదోవపట్టించి, ఒక్కోసారి పతనావస్థకు గురి చేసే ప్రమాదకర శక్తులే అష్టసిద్ధులని కొందరు మహాయోగులు చెబుతారు.

సిద్ధులు లభించగానే బుద్ధులు మారిపోతాయి. అహంకారం ఆవహిస్తుంది. విచక్షణ నశిస్తుంది. నిగ్రహం నీరుకారిపోతుంది. ఇలాంటి దుస్థితి కలగరాదని కోరుకునే వారు అష్టసిద్ధుల్ని తిరస్కరిస్తారు. లేదా వాటిని కేవలం సిద్ధులకోసమే యోగం అభ్యసిస్తారు. వాటిని ప్రదర్శిస్తూ ప్రజల్ని మభ్యపెడుతుంటారు. ఇవన్నీ మొక్షప్రాప్తికి ఆటంకాలే!


దేవభూమిగా వినుతించే హిమలయాల్లో అక్కడ క్కడ మంచు గుహల్లో తపస్సులో నిమగ్నులైన ఋషులు కనిపిస్తుంటారు. ఒక గుహలో జీవానందుడు, సత్యానందుడనే ఇద్దరు ఋషులు బహుకాలం తప్పస్సు చెయ్యగా, అప్రయత్నంగా ఇద్దరికీ అష్టసిద్ధులు లభించాయి. జీవానందుడు  తనకు లభించిన సిద్ధులతో తబ్బిబ్బై, వాటిని ప్రదర్శించాడానికి జనసీమల్లోకి వెళ్ళాడు. సత్యానందుడు తన సిద్ధుల్ని శివార్పణంచేసి తన తపస్సు కొనసాగించాడు.

జీవానందుడు అష్టసిద్ధుల ప్రదర్శనతో ప్రజలచేత బ్రహ్మరథం పట్టించుకున్నాడు. ఒక పెద్ద ఆశ్రమం, అనేకమంది శిష్యులతో ఆడంబర జీవితం గడపసాగాడు. అతని దగ్గరకు రాజు, రాజోద్యోగులు, రాణి, ఆమె సఖులు ఇట్లా ఉన్నత వర్గాలవారు వస్తూపోతుండటంతో జీవానందుడు తనను తానే భగవత్స్వరూపుడిగా  ప్రకటించుకుని అనేక పూజలు, సేవా సపర్యలు సాగించుకుంటూ విలాసమయ జీవితానికి అలవాటుపడ్డాడు. ఇలా ఉండగా మహారాణి వచ్చిన సమయంలో జీవానండుడి శిష్యవర్గం లోని ఒక పూర్వాశ్రమ చోరుడు, ఆమె మెడలోని విలువైన హారం దొంగిలించాడు. ఇంకేముంది? గందరగోళం, రాజభటులు తనిఖీలు చేయ్యటం, ఆభరణం ఆశ్రమంలోనే దొరకడంతో, జీవానందుడి సహితంగా అందరికీ కారాగా శిక్షపడింది. జీవానందుడి ఆశ్రమం మూతపడింది. శిక్ష పూర్తిచేసుకున్న జీవానందుడు నేరుగా హిమలయాల్లో ఉన్న తన గుహకుచేరుకున్నాడు. అక్కడ సత్యానందుడు దివ్యతేజస్సుతో వెలిగిపోతున్నాడు. అతని సమీపంలో ఒక సహజ హిమలింగం కనిపించింది. గుహనిండా పరిమళాలు గుబాళిస్తున్నాయి. జీవానందుడు తన అనుభవాలు చెప్పి, సత్యానందుడి అనుభవాలు అడిగాడు.

నేను నాకు లభించిన అష్టసిద్ధుల్ని ఈశ్వరార్పణ చేశాను. నా తపస్సు కొనసాగించాను. ఇదుగో శివలింగం ఉన్నచోటనే పరమశివుడు ప్రత్యక్షమై సాయుజ్యభక్తిని ప్రసాదించాడు. నేనిప్పుడు కనులు తెరిచినా, మూసినా, సర్వత్రా శివరూపాన్నే చూస్తున్నానుఅన్నాడు సత్యానందుడు.

జీవానందుడు పశ్చాత్తాపపడి, సత్యానందుణ్ని తన గురువుగా స్వీకరించి, తానుకూడా ఈశ్వర సాక్షాత్కారం కోసం తీవ్రంగా తపస్సు చెయ్యసాగాడు. మరెన్నడూ అష్టసిద్ధుల ప్రలోభాలకు జీవానందుడు లోనుకాలేదు.

=========================================


Translate